రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల (పీఏసీఎస్- ప్యాక్)కు ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేరేజు సాయంత్రం కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ షెడ్యూల్ విడుదలచేసింది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 909 పీఏసీఎస్లు ఉండగా.. మూడుచోట్ల ఎన్నికలు నిర్వహించడంలేదని అథారిటీ పేర్కొంది. వీటిలో వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని ఒక్కొక్క సహకార సంఘం పాలకవర్గాలకు ఆగస్టు చివరి వరకు కాలపరిమితి ఉన్నదని, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి పనితీరు సక్రమంగా లేకపోవడంతో దానిని రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 15న సహకార ఎన్నికలు